మోహన్‌లాల్ సుఖాడియా యూనివర్సిటీలో ఓ ఉడుత నెల రోజులుగా విద్యార్థులు, సిబ్బందిపై దాడి చేస్తూ 18 మందిని గాయపరిచింది. దీంతో క్యాంపస్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. తీవ్ర ఎండలు, ఆకలి కారణంగా ఉడుత దూకుడుగా ప్రవర్తిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. యానిమల్ ఎయిడ్ విఫలం కావడంతో, వన్యప్రాణి నిపుణుల సహాయంతో ఉడుతను పట్టి అటవీ ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.