పులిగుండాల అడవుల్లో చిరుతలు.. ట్రాప్ కెమెరాలో అరుదైన దృశ్యాలు

ఖమ్మం జిల్లాలోని కనకగిరి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సందడి పెరిగింది. ట్రాప్ కెమెరాలకు రెండు చిరుతలు చిక్కాయి. జింకలు, దుప్పులతో పాటు చిరుతలు సమృద్ధిగా ఉండటం ఇక్కడి పర్యావరణ సమతుల్యతకు నిదర్శనం. అటవీ శాఖ నిరంతర పర్యవేక్షణ, రక్షణ చర్యల వల్ల వన్యప్రాణులు సురక్షితంగా జీవిస్తున్నాయని అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి















