నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటే ఆ రంగాల్లో ఉద్యోగాలకు ఢోకా లేదు.. RBI మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్

నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. మానవ వనరుల అభివృద్ధి కోసం పోషకాహార లోపం సమస్యను తగ్గించుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ భవిష్యత్తు ప్రణాళిక పైన నిర్వహించిన సమావేశంలో రఘురామ్ రాజన్ పలు సూచనలు చేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రఘురామ్ రాజన్ తో పాటు డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు..
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













