కోట్లాది భక్తులకు నిలయం తిరుమల. భక్తుల రద్దీ, భద్రత, సేవల్లో పారదర్శకత పెంపునకు టీటీడీ అత్యాధునిక ఏఐ సాంకేతికతను అమలు చేస్తోంది. ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఫేస్ రికగ్నిషన్, ఫుడ్ ల్యాబ్‌లు, ఏఐ డ్రోన్ నిఘా వంటి ఏడు కీలక అంశాలతో భక్తుల అనుభవం మెరుగుపరుస్తోంది. ఇది భవిష్యత్తు దేవాలయాలకు మార్గదర్శకం.