మండిపోతున్న ఎండల వల్ల శరీరం త్వరగా అలసిపోవడం, నీరసించడం సహజం. ఈ సమయంలో శరీరానికి కేవలం నీరు మాత్రమే కాదు.. సరైన పోషణ కూడా అవసరం. వేసవిలో మనకు సులభంగా, తక్కువ ధరలో లభించే బొప్పాయి పండు ఆరోగ్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ఇందులో ఉండే నీటి శాతం, విటమిన్లు, ఖనిజాలు వేసవి తాపం నుండి మనల్ని రక్షించడమే కాకుండా శరీరాన్ని లోపలి నుండి శుద్ధి చేస్తాయి.