నేటి ఆధునిక జీవనశైలిలో సరైన సమయానికి భోజనం చేయకపోవడం, పీచు పదార్థం లేని జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి కలగడం, వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే విసర్జన జరగడం వంటివి మలబద్ధక లక్షణాలు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే కాలేయం మరియు పేగు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.