ఎండల తీవ్రత, గాలిలో కాలుష్యం గంటల తరబడి మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్లను చూడటం వల్ల మన కళ్లు విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటాయి. దీనివల్ల కళ్లు ఎర్రబడటం, నీరు కారడం, వాపు చికాకు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి మందుల కంటే సహజమైన మార్గాలు ఎంతో మేలు చేస్తాయి. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచనల ప్రకారం, చల్లటి దూది ప్యాడ్‌లను (Cold Cotton Pads) కళ్లపై ఉంచుకోవడం వల్ల కంటి కండరాలు విశ్రాంతి పొంది, తక్షణ ఉపశమనం లభిస్తుంది. అన్ని వయసుల వారు పాటించదగ్గ ఈ సులభమైన ఇంటి చిట్కా గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి.