Mumbai Indians: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఆటతీరు అత్యంత పేలవంగా తయారైంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఏకంగా నాలుగు పరాజయాలను మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయింది. పంజాబ్ కింగ్స్ చేతిలో ఎదురైన ఘోర పరాజయం తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. జట్టులో భారీ మార్పులు ఉంటాయని సంకేతాలు ఇవ్వడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.