AP, Telangana Heatwave Alert: రెండు తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రభావంతో జనం అల్లాడుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఏప్రిల్‌ నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. అటు ఏపీ, ఇటు తెలంగాణలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమొదవుతున్నాయి. భారీ ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.