అక్షయ తృతీయ పర్వదినం వైశాఖ మాసంలో వచ్చే అత్యంత ముఖ్యమైన దినం. "అక్షయం" అంటే ఎప్పటికీ నాశనం కానిది. ఈ రోజు చేసే ఏ పనికైనా అక్షయమైన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు, పండితులు పేర్కొంటున్నారు. అక్షయ తృతీయ అనగానే చాలామంది బంగారం కొనుగోలు చేయాలని భావిస్తారు. అయితే, బంగారం కొనుగోలు అనేది ఈ రోజు చేయవలసిన క్రియల్లో ఒక శాతానికే చెందిందని, దీనికి మించి 99 శాతం ఇతర ముఖ్యమైన దానధర్మాలు, పూజలు ఉన్నాయని పేర్కొంటున్నారు.