🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
📖
పంచతంత్రం

మూడుచేపల కథ

mooducheepala katha

⏱️ 19 నిమిషాల పఠనం

ఒక చెరువులో "దూరదర్శి, కుశాగ్రబుద్ధి, మందబుద్ధి" అనే మూడు చేపలు ఎంతో స్నేహంగా ఉండేవి. ఒక సంవత్సరం వానలు సరిగా పడక చెరువులో నీరు బాగా తగ్గింది. అది గ్రహించి దూరదర్శి మిగిలిన రెండు చేపలను చూచి "స్నేహితులారా! ఈ ఏడు వానలు లేవు. మనమున్న ఈ చెరువు ఎండిపోతుంది. కనుక మనము మరొక చెరువుకు పోదాము. లేకుంటే జాలరులు వచ్చి మనల్ని పట్టుకొని చంపేస్తారు" అన్నది. ఎప్పుడో ఆపద వస్తుందని ఇప్పుడే ఎక్కడో తెలియని చోటుకి వెళ్దామంటావేంటి? అంతగా ఆపద వస్తే అపుడు ఆలోచిద్దాంలే, తరువాత దేవునిపైన భారం వేద్దాం అన్నది కుశాగ్రబుద్ధి. మందబుద్ధి కూడా ఏం మాట్లాడక ఊరుకుంది. వీళ్ళతో మనకు కుదరదని దూరదర్శి ఆ రోజే మరొక చెరువుకు వెళ్ళిపోయింది.

మరికొన్నాళ్లకు చెరువులో నీరు బాగా తగ్గిపోగా, జాలర్లు వచ్చి వలలు పన్ని చేపలు పట్టారు. కుశాగ్రబుద్ధి, మందబుద్ధి ఇరువురూ ఆ వలలో చిక్కుకున్నారు. ఒక జాలరి వచ్చి అవి చిక్కుకున్న వలను విడతీసి బతికి ఉన్న చేపలను తన చేతిలోనికి, చనిపోయిన చేపలను చెరువు గట్టుపైకి వేయుచున్నాడు. అది గమనించిన కుశాగ్రబుద్ధి చనిపోయిన దానివలే కదలక, మెదలక పడియున్నది. జాలరి దానిని ఒడ్డుకు విసిరి వేశాడు. సమయం చూచి అది మెల్లగా ఎగురుతూ చెరువులోనికి జారుకొని ప్రాణాలు కాపాడుకొన్నది.

ఏ ఉపాయము తెలియక గిలగిల కొట్టుకొనుచున్న మందబుద్ధిని జాలరి తన బుట్టలో వేసుకొని చంపేశాడు. కనుక మిత్రుల మాటలు విని తీరాలి. సాధ్యమైనంతవరకూ మన ప్రయత్నం మనం చేయాలి. మనకు సాధ్యం కాని విషయంలో దేవునిపై భారం వేయాలి. కానీప్రతి చిన్న విషయంలోనూ దేవుడా నీదే భారం అని ఎవరైనా కూర్చుంటారా?" అని ప్రశ్నించింది. భార్య మాటలు విని మగతీతువుపక్షి నవ్వి ఊరుకుంది.

కొన్నాళ్ళకు ఆడతీతువు పక్షి మరల గుడ్లను పెట్టింది. భార్య అయిన ఆడతీతువు పక్షి నెత్తి నోరు మొత్తుకున్నా వినని మగతీతువు పక్షికి బుద్ధి చెప్పాలని సముద్రుడు పెద్ద కెరటాలతో ఉప్పొంగి గుడ్లను అపహరించాడు. ఆడతీతువు నిద్రాహారాలు మాని దుఃఖించసాగింది. మగతీతువు పక్షి గరుత్మంతుని ప్రార్థించాడు. గరుడుడు వచ్చి తీతువు పక్షి కోరిక తెలుసుకున్నాడు. వెంటనే సముద్రుడిని పిలిచి వాని గుడ్లను వానికప్పగించాడు. కాబట్టి బుద్ధిమంతుడు తనకంటే విరోధిగల ఉపాయంతోనే జయించాలి. యుద్ధం చేసి గెలుస్తామనే నమ్మకం లేనపుడు పోట్లాటకు దిగటం శుద్ధ దండగ.

దమనకుడు ఇట్లు చెప్పగా విని సంజీవకుడు "ఉపాయాలు, కుట్రలు, కుతంత్రాలు పిరికివాళ్ళకేకానిపౌరుష వంతులకు పనికిరావు. మన పింగళకుడు మహా బలవంతుడని నాకు తెలుసు. వీరుడు బలవంతునితో యుద్ధం చేసి గెలుస్తాడు. అఖండ కీర్తిని సంపాదిస్తాడు. గెలిచినా,ఓడినా లెక్క చేయడు. గెలిస్తే జనులందరిచేత జేజేలందుకొంటారు. మరణిస్తే వీరస్వర్గము అందుకుంటాడు. కాబట్టి పింగళకునితో యుద్ధం చేసి విజయమో, వీరస్వర్గమో తేల్చుకుంటాను. నీవు ముందుగా పోయి రాజుగారికి నేను యుద్ధానికి వస్తున్నానని సిద్ధంగా ఉండమని చెప్పు అన్నాడు.

దమనకుడు తన ఎత్తుగడ పారినందుకు లోలోపల ఎంతో సంతోషిస్తూ సంజీవకుని వద్ద సెలవ తీసుకొని పింగళకుని వద్దకు పోయి, "మహారాజా! నేను చెప్పాను కదా! సంజీవకుని కళ్ళు నెత్తికెక్కినవని, మిమ్ములను బుద్ధిహీనుడనీ, మంచి చెడ్డ తెలియని అవివేకి అని అన్నాడు. నిదానం లేని నీచుడని, మీకు లొంగి ఉండి సలామ్ చేయుట ఇక ఎంత మాత్రం సాగదని చెప్పాడు. తమతో పోరాడి విజయమో, వీరస్వర్గమో తేల్చుకొనడమే తన కర్తవ్యం అన్నాడు. "వినాశకాలే విపరీతబుద్ధిః" అన్నట్లు చెడిపోయే కాలం వస్తే చెడు బుద్ధులే కాని మంచి బుద్ధులెలా వస్తాయి" అని ఉన్నవీ, లేనివీ సంజీవకుడు అన్నవీ, అననవీ ఇంకా ఎన్నో మాయమాటలు కల్పించి అతనిపై పింగళకునికి బాగా కోపం కలిగించేలా చేసింది.

పింగళకుడు పట్టరాని కోపంతో భయంకరంగా గర్జించాడు. అదే సమయంలో సంజీవకుడు వచ్చి గట్టిగాఢీ కొన్నాడు. ఒకరికొకరు తీసిపోకుండా కొంతసేపు పోట్లాడారు. పింగళకుని గర్జనలతో సంజీవకుని రంకెలతో ఆ అడవి అంతా దద్దరిల్లింది. సంజీవకుణ్ణి తన పంజాతో గట్టిగా ఒక దెబ్బ వేయబోయాడు. అది తప్పించుకొని సంజీవకుడు తన వాడియైన కొమ్ములతో పింగళకునిడొక్కలో ఒక్క కుమ్ము కుమ్మాడు. ఆ దెబ్బకు పింగళకుడు మూర్చబోయాడు.

ఇది అంతయు చూస్తున్న కరటకుడు, దమనకునితో "నీ మాటలు విని మనరాజు పడరాని పాట్లు పడుతున్నాడు చూడు" అన్నాడు. తగిన సలహా ఇవ్వని మంత్రి వలన ధరణీనాధుడు చెడిపోయాడు. నీ స్వలాభం కోసం రాజును పరివారంతో ఆలోచించనీయకుండా చేశావు. సాధుస్వభావం గల సంజీవకుణ్ణి ప్రాణం మీదకి తెచ్చావు. ఇలాంటి పాపపు పనులు మానుకొమ్మని నేనెంత చెప్పినా వినకపోతివి. నీ వంటి మూర్ఖులకు హితంచెప్పేవాడు కోతులకు బుద్ధి చెప్పబోయి సుచీముఖం లాగా ప్రమాదానికి గురి అవుతాడు. ఆ కథ చెపుతాను విను అని ఇలా చెప్పసాగాడు.

📖 మరిన్ని పంచతంత్రం

Advertisement
Sponsored by ATA – American Telugu Association