22723 వార్తలు




జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని అరణ్యభవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన తన సతీమణి పద్మజతో కలిసి పాల్గొన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, వృక్ష విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచడం ఏపీ గ్రీన్ ప్రధాన లక్ష్యం. ఈ పదవికి రాష్ట్ర ప్రభుత్వం నాగబాబుకు కేబినెట్ ర్యాంకు హోదా కల్పించింది. మొక్కలు నాటడంతో పాటు వాటి మనుగడపై దృష్టి పెట్టి, అన్ని శాఖలను సమన్వయం చేస్తూ పచ్చదనం పెంపునకు కృషి చేస్తానని నాగబాబు తెలిపారు.














