
3326 వార్తలు
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ వ్యవహారంలో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఎంపీ ఎంవీవీ... తన మిత్రుడు ఆడిటర్ జీవీ ఫోన్ ఎత్తకపోవడంతో ఏదో జరిగిందని అనుమానించి పోలీస్ కమిషనర్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
భూమికి వేల అడుగుల ఎత్తులో గాల్లో ఉండగానే ఓ విమానం అత్యవసర ద్వారం తెరుచుకుంది. దాంతో విమానంలో ప్రయాణిస్తున్న వారందరూ ప్రాణాలను అర చేతుల్లో పెట్టుకుని ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయంభయంగా కూర్చున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని రానున్న లోక్సభ ఎన్నికల్లో గద్దె దించేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రతిపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) ఓ ప్రత్యేక ఫార్ములాను రూపొందించారు.
ఆర్థిక ఇబ్బందులతో వైసీపీ సర్కారు సతమతమవుతోంది. వైసీపీ ప్రభుత్వం మరోసారి అప్పు బాట పట్టింది. మరో రూ.1000 కోట్ల అప్పు కోసం ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. 9 ఏళ్లకు రూ.500 కోట్లు, 17 ఏళ్లకు మరో రూ.500 కోట్ల రుణం తీసుకునేందుకు జగన్ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే మంగళవారం రిజర్వ్ బ్యాంక్ వద్ద వెయ్యి కోట్ల సెక్యూరిటీ బాండ్ల వేలం వేయనుంది.
పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలంటూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంయుక్తంగా శనివారంనాడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి.