9630 వార్తలు


నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళా సాధికారత లక్ష్యంగా, ఇందిరా మహిళా శక్తి పథకం కింద ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం వికారాబాద్, మధిర ప్రాంతాల్లోని మహిళా సమాఖ్యలకు మంజూరైన సోలార్ విద్యుత్ ప్లాంట్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. తొలి దశలో 6 మెగావాట్ల ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. మహిళా సంఘాలే ఈ ప్లాంట్లను నిర్వహిస్తూ, విద్యుత్ను విక్రయించడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందనున్నాయి. The post నేడు వికారాబాద్ లో సోలార్ ప్లాంట్లు ప్రారంభం appeared first on Navatelangana.




తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి వెలుపల క్యూలైన్లలో వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఆదివారం శ్రీవారిని 98,058 మంది భక్తులు దర్శించుకున్నారు. 49,234 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.09 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు తెలిపారు. 4.2 లక్షల లడ్డు ప్రసాదాలను విక్రయించినట్టు అధికారులు వెల్లడించారు.

ముంబయి: కారు లోయలో పడి ఎనిమిది మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో జరిగింది. మహాబలేశ్వర్-పోలాద్ పూర్ రోడ్డులోని అంబెనలి ఘాట్ వద్ద సోమవారం ఉదయం స్కార్పీయో వాహనం అదుపుతప్పి 1000 అడుగుల లోతుగల లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. రెస్క్యూ టీమ్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కఠినమైన కొండ ప్రాంతం కావడంతో మృతదేహాలను బయటకు తీయడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. మృతులు సతారా జిల్లాలోని కోరగామ్ తాలూకాలోని అస్గాన్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. దీపాలీ నుంచి సతారా జిల్లాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై రూ.2.84, డీజిల్ పై రూ.2.86 చొప్పున పెరిగింది. లీటర్ పెట్రోల్ ధర రూ.115.58, డీజిల్ ధర 113.74 గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.19, డీజిల్ ధర 104.88 గా ఉంది. ఇప్పటికే మూడు విడతలుగా పెట్రోల్, డీజిల్ రూ.5 పెరిగాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరల ప్రభావంతో తిరిగి ఇప్పుడు ధరను పెంచాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రకటించాయి. ఇరాన్ యుద్ధం తరువాత పెరిగిన ముడిచమురు ధరల ప్రభావం ఇప్పుడు ఇంధన వినియోగదారులపై పడింది. మే 18న పెట్రోల్పై 0.86 పైసలు, డీజిల్పై 0.83 పైసలు, మే 22న పెట్రోలుపై లీటరుకు 87 పైసలు, డీజిల్పై లీటర్కు 91 పైసలు పెంచారు. పది రోజుల క్రితమే దేశంలో పెట్రోలు, డీజిల్పై లీటరు కు మూడు రూపాయలు చొప్పున ధరలు పెంచిన విషయం తెలిసిందే.

అమరావతి: పోలీసులు వేధిస్తున్నారని ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తెనాలిలో సాయిబాబా, తిరుపతమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. స్వర్ణలతకు సంబంధించిన నగలను తిరుపతమ్మ తాకట్టు పెట్టింది. నగలు తిరిగి ఇవ్వడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో స్వర్ణలత ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి తిరుపతమ్మ, సాయిబాబాను స్టేషన్ కు తరలించి విచారించారు. తాకట్టు పెట్టిన దుకాణంలో తిరుపతమ్మ నగలు తీసుకెళ్లినట్టు విచారణలో తేలింది. తాము నగలు తాకట్టు పెట్టినవి స్వర్ణలతకు తెచ్చి ఇచ్చామని, తాము చెప్పిన కూడా పోలీసులు నమ్మడం లేదని, తన భర్తను పోలీస్ స్టేషన్ లో చితక బాదారని తిరుపతమ్మ వాపోయింది. ఎస్ఐ తనతో అసభ్యంగా మాట్లాడారని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తాను చనిపోయిన తరువాత తనకు న్యాయం చేయాలని సెల్ఫీ వీడియో తీసి జిల్లా కలెక్టర్ ను కోరారు. తిరుపతమ్మ గడ్డి మందు తాగడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. స్వర్ణలత, ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి తమను బెదిరించారని సాయిబాబా తెలిపా



నవతెలంగాణ – హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు ప్రజలు విలవిలలాడుతున్నారు. ఆదివారం ఒక్కరోజే వడదెబ్బ కారణంగా మొత్తం 60 మంది(తెలంగాణలో 42, ఏపీలో 18) చనిపోయినట్లు సమాచారం. ఉదయం 10 గంటల నుంచే సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. నేటి నుంచి రోహిణి కార్తె ప్రారంభమవడంతో మరికొన్ని రోజులు ఎండ తీవ్రత ఉండనుంది. ఈ ఎండల దృష్ట్యా ప్రజలు అత్యవసరం అయితే తప్పా బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. The post వడదెబ్బతో ఒక్కరోజే 60 మంది మృతి appeared first on Navatelangana.


రైల్వే ప్లాట్ఫామ్పై మహిళ ప్రసవం.. వికారాబాద్ జిల్లా తాండూరు ప్లాట్ ఫామ్ పై ఘటన







కొత్త పథకం ద్వారా 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా రక్షణ మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు27న సోలార్ ప్లాంట్ల పథకం ప్రారంభం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వెల్లడిమన తెలంగాణ/ ఖమ్మం బ్యూరో: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా చారిత్రాత్మక ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. కులమతాలకతీతంగా, పేద, ధనిక భేదం లేకుండా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు ఈ బీమా రక్షణ కవచంలా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఆదివారం ఖమ్మం నగరంలో జరిగిన సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా అభినందన సభలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో పాటు భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు కనీసం రూ.లక్ష సాయం కోసం చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేకపోయిందని భట్టి విమర్శించారు. అటువంటి దుస్థితి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే, ప్రమాదవశాత్తు కుటుంబ యజమానిని కోల్పోయిన ప్రతి ఇంటికీ రూ.5 లక్షల బీ

హ్యామ్ రోడ్ల విధానంలో ప్రభుత్వ ఖజానాకు రూ.2,500 కోట్లు ఆదానిర్మాణ పనులను 5శాతం ఎక్సెస్కు మించకుండా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయంకేబినెట్ సమావేశంలోనే అధికారులకు సిఎం రేవంత్రెడ్డి ఆదేశాలుఆ మేరకే టెండర్లు 23.5 శాతం ఎక్సెస్ వల్ల భారీ అవకతవకలు జరగబోతున్నాయని ఆరోపించిన హరీశ్రావువివిధ వేదికల ద్వారా పదేపదే అభ్యంతరం చెబుతూ వచ్చిన బిఆర్ఎస్ నేత అప్రమత్తమైన ప్రభుత్వం ఏడాదిన్నరగా సాగిన వివాదానికి తెరమన తెలంగాణ/హైదరాబాద్: హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) విధానంలో ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం చేపట్టే అంశంపై శనివారం జరిగిన మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంతో ఏడాదిన్నరగా నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులను 5 శాతానికి మించకుండా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంత్రిమండలి సమావేశంలో అధికారులను ఆదేశించడంతో ఇక ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 2 వేల నుంచి 2 వేల కోట్లు ఆదా కానున్నాయని అంచనా. రాష్ట్ర ఖజానాకు ఇంతటి పెద్ద మొత్తంలో డబ్బు ఆదా కావడానికి పరోక్షంగా దోహదపడిన క్రెడిట్ మాజీ మంత్రి, సిద

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్లోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నియమాలు పాటించని సాఫ్ట్వేర్ ఉద్యోగిపై ఎస్ఐ అనిల్ చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో, ఎస్ఐతో వాగ్వాదానికి దిగిన సదరు ఉద్యోగి, అడ్డుకోవడానికి వచ్చిన హోంగార్డ్ కుమార్ పై దాడి చేశాడు. ఈ దాడిలో హోంగార్డ్ కుమార్ కు గాయాలయ్యాయి. దీంతో, సాఫ్ట్వేర్ ఉద్యోగిని అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు అప్పగించి, ఎస్ఐ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా […] The post హోంగార్డుపై సాఫ్ట్వేర్ ఉద్యోగి దాడి appeared first on Navatelangana.