అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుకొండ పట్టణ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై రెండు లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఒకరు సజీవదహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా క్లీనర్ జనార్థన్ స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతుడు తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం జామి గ్రామానికి చెందిన కిరణ్(35)గా గుర్తించారు.